కొండపాకలోని రాజీవ్ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగడం సాధారణం. ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స అందించడంతో పాటు దవాఖానచేరుస్తున్నారు 108 సిబ్బంది. ఆరోగ్యం బాగా లేని వారిని, పాము, తేలు కాటుకు గురైన వారిని, ప నులు చేస్తూ ప్రమాదాల్లో గాయపడ్డ వారిని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సకాలంలో దవాఖానలకు చేరుస్తూ ప్రాణదాతలవుతున్నారు. ముఖ్యంగా పు రిటి నొప్పులతో ప్రసవ వేదన పడుతున్న గర్భిణు ల పాలిట ఆపద్బాంధవులుగా మారారు. ఎంతో మంది గర్భిణులను సురక్షితంగా దవాఖానలకు చేర్చుతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పు డు 108లోనే సురక్షితంగా పురుడు పోసి, అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా దవాఖానకు చేర్చి, మెరుగైన వైద్యం అందించడంలో తోడ్పడుతూ గర్భిణులకు కొండంత అండగా నిలుస్తున్నారు.
అత్యవసర సేవలకు అవార్డులు
కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది అత్యవసర సేవలు అందించడంలో తమదైన ముద్ర వేసుకున్నారు. అత్యధిక, అత్యవసర వైద్య సేవలు అందించిన అంబులెన్స్ సిబ్బందిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పేరు సంపాదించారు. కొండపాక 108 వాహనంలో మొత్తం నలుగురు సిబ్బంది దశాబ్ద కాలానికి పైగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కాగా, మరో ఇద్దరు అంబులెన్స్ పైలెట్లు. వీరు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం, వీరికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు అందజేసింది. మెడికల్ టెక్నీషియన్ బైండ్ల మహేందర్ 2012లో మొదటిసారి అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి గీతారెడ్డి చేతుల మీదుగా బెస్ట్ మెడికల్ టెక్నీషియన్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు వరుసగా అవార్డులు అందుకున్నాడు. జీవీకే 108 సర్వీసెస్లో కూడా అవార్డులు అందుకొని ఆదర్శంగా నిలిచాడు. 2015లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవల పురస్కారాన్ని అందుకున్నాడు. కొండపాక 108 సిబ్బంది రాయిని రాజిరెడ్డి ఉత్తమ మెడికల్ టెక్నీషియన్గా, పంజాల రమేశ్, బండి శ్రీనివాస్ ఉత్తమ పైలెట్లుగా పలుమార్లు అప్పటి జిల్లా కలెక్టర్లు దినకర్బాబు, రోనాల్డ్రోస్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
కరోనా కాలంలోనూ కీలక పాత్ర..
జనవరి 2020 నుంచి మొదలుకొని డిసెంబర్ 31 వరకు కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది మొత్తం 1193 మందికి వైద్య సేవలు అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 191 మందికి ప్రథమ చికిత్స చేసి దవాఖానకు చేర్చారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న 354 మంది గర్భిణులను సురక్షితంగా దవాఖానకు తరలించారు. ఛాతినొప్పితో బాధపడుతున్న 28మంది, పురుగుల మందు తాగిన 54 మంది, పాము, తేలు కాటుకు గురైన 12మంది, అనారోగ్యంతో బాధపడుతున్న 488 మందికి వైద్య సేవలు అందించారు. కరోనా సమయంలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 66 మంది కరోనా బాధితులను దవాఖానకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
సంతోషంగా ఉంది
ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించి దగ్గరి దవాఖానకు చేర్చి, ప్రాణాలను కాపాడినప్పుడు కలిగే సంతోషం మరుపురానిది. ఇలా వైద్య సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. 11ఏండ్లలో మా సేవలను గుర్తించి ప్రభుత్వం పలు అవార్డులతో ప్రశంసించినందుకు కృతజ్ఞతలు.
గొప్ప అవకాశం దక్కింది
ఆపదలో ఉ న్న వారికి ధైర్యం చెబుతూ అత్యవ సర చికిత్స అం దించి, మరింత మెరుగైన వైద్య సహాయాన్ని అందించడంలో పాలు పంచుకునే గొప్ప అవకాశం దక్కింది. ఎంతో మంది మేము చేసిన సేవలను గుర్తించి అభినందించి నప్పుడు, నేను పడ్డ కష్టమంతా మర్చిపోతుంటా.. మా సేవలను గుర్తించి పలు అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది.
ఇవీ కూడా చదవండీ..
వ్యాక్సిన్లు పంపిస్తూనే ఉంటాం.. రెండో డోసు కోసం దాచిపెట్టొద్దు: కేంద్రం
ముఖేష్ ఇంటి ముందు వాహనం నిలిపింది వాజే డ్రైవర్: ఎన్ఐఏ