కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. సిలిగురిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో టీఎంసీ గూండాలు తనపై దాడి చేసినట్లు జల్పాయిగురి ఎంపీ డాక్టర్ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు. దుండగులు తన తల, చేతులపై వెదురు కర్రలతో కొట్టారని అన్నారు. తనతో పాటు మరికొందరిపైనా టీఎంసీ గుండాలు దాడి చేశారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో చట్ట నియమం లేదని ఆయన మండిపడ్డారు. కాగా, ఎంపీ జయంత కుమార్ రాయ్ తల, పొత్తికడుపుపై దెబ్బలు తగిలాయని సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సర్జరీ హెడ్ డాక్టర్ ఎ.ఎన్. సర్కార్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందన్నారు.