కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతుండగా బీజేపీ విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావచ్చని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించినట్లు ఆ ఆడియోలో ఉన్నది.
అయితే, అది తన ఆడియో కాదని ప్రశాంత్ కిశోర్ ట్విటర్ ద్వారా ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల కంటే, తన మాటలను బీజేపీ సీరియస్గా తీసుకోవడం ఆనందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు తమకు అనుకూలమైన క్లిప్పింగులకు బదులుగా ధైర్యం ఉంటే మొత్తం ఆడియోను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల మార్క్ను కూడా దాటబోదని చెప్పారు.
బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జి అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన ఒక ఆడియో క్లిప్ ప్రకారం.. మమతపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారీటీ బాగా పెరిగిందనీ, దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ప్రశాంత్ కిశోర్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా బీజేపీ డ్రామా అని మండిపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్
కూచ్బెహర్ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
నియోజకవర్గంలో మహిళల ఓట్లన్నీ నావే: పాయెల్ సర్కార్