తక్కువ ఖర్చుతో ఓపాడ్ ఇండ్లు నిర్మిస్తున్న
మానసారెడ్డికి ఎమ్మెల్సీ కవిత అభినందనలు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానసారెడ్డిని ఆమె అభినందించారు. సోమవారం మానసారెడ్డి హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి కొత్త పద్ధతిలో ఇండ్ల నిర్మాణాన్ని వివరించారు. మానసారెడ్డి భవిష్యత్లో మరిన్ని నూతన విధానాలు ఆవిష్కరించి, రాష్ర్టానికి గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన మానసారెడ్డి రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపులో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్ ఇంటిని హైదరాబాద్ శివారు చెంగిచర్లలో నిర్మించిన విషయం తెలిసిందే.