కోల్కతా: కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికార పరిధిని పెంచడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ( Mamata Banerjee ) తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. బలగాలంటే తనకూ గౌరవమేనని, అయితే భద్రత పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయొద్దని ఆమె సూచించారు. బీఎస్ఎఫ్ బలగాల అధికార పరిధిని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని ఆమె చెప్పారు.
పశ్చిమబెంగాల్లో సరిహద్దులు సంపూర్ణంగా శాంతి నెలకొని ఉన్నాయని, అక్కడ బీఎస్ఎఫ్ బలగాల జోక్యం అవసరం లేదని మమతాబెనర్జి చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇవాళ కుర్సియాంగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.