కోల్కతా: బెంగాల్లో ఎన్నికల అనంతర హింసకు బీజేపీ నేతలే కారణమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బెంగాల్ చుట్టూ తిరుగుతూ రెచ్చగొడుతున్నారని ఆమె విమర్శించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 24 గంటలైనా గడువక ముందే వాళ్లు (బీజేపీ) లేఖలు, విచారణ బృందాలను పంపుతున్నారని, ఒకరి తర్వాత ఒకరు బెంగాల్కు వస్తున్నారని మమత మండిపడ్డారు.
బెంగాల్ ఓటమిని బీజేపీ నేతలు జీర్ణించుకోవడంలేదని, వాళ్లు ప్రజా తీర్పును ఓర్వలేక పోతున్నారని మమతాబెనర్జి ఎద్దేవా చేశారు. దయచేసి వారు ప్రజాతీర్పును గౌరవించాలని మమత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన 16 మందిలో సగం మంది బీజేపీ కార్యకర్తలు ఉంటే, సగం మంది టీఎంసీ కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. చనిపోయిన వారికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఇప్పటికే బీజేపీ నేతల బృందం రాష్ట్రానికి వచ్చిందని, వాళ్లంతా టీ తాగి వెళ్లిపోయారని మమత వెక్కిరింత ధోరణిలో అన్నారు. ఇక కేంద్ర మంత్రులు వచ్చేదుంటే వాళ్లు ప్రత్యేక విమానంలో వచ్చినా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపంచాలని, అందరకీ ఒకటే రూల్ వర్తిస్తుందని ఆమె చెప్పారు. బీజేపీ నేతలు మళ్లీమళ్లీ రాష్ట్రానికి వచ్చిపోతుండటం వల్లనే ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు