చండీగఢ్: కాంగ్రెస్ పార్టీలోని యోగ్యులు, యువతను తాను గౌరవిస్తానని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఎన్నికల్లో వినియోగించుకుని అనంతరం పక్కన పెట్టే రకం తాను కాదని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం పంజాబ్ కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా సిద్ధూ మాట్లాడారు. ‘పంజాబ్ను ఇష్టపడే వారిని ఎన్నికల సమయంలో షో పీస్గా ఉపయోగిస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ వ్యక్తులను పక్కనపెడతారు. లాభం చేకూర్చే వారిపై ఆసక్తి చూపుతారు’ అని ఆయన విమర్శించారు. అయితే తాను మాత్రం పార్టీలోని యోగ్యులు, యువతకు గౌరవం ఇస్తానని, ఈ మేరకు హామీ ఇస్తున్నానని సిద్ధూ చెప్పారు.