ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోగ్ ఉన్ ఆరోగ్యం గురించి మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆయన ఫొటో. ఇది ఇటీవల బయటపడింది. ఈ ఫొటోలో ఆయన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. బరువు మునుపటి కంటే చాలా తక్కువకు వచ్చినట్లుగా కనిపిస్తున్నది. దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ ప్రకారం, అతని ఈ ఫొటోను ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా శనివారం విడుదల చేసింది. ఈ ఫోటో గత వారం అధికార పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో ప్రసంగించినప్పటిదిగా నిపుణులు పేర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన ఈ సమావేశంలో కనిపించినట్లుగా చెప్తున్నారు.
సియోల్కు చెందిన ఒక వెబ్సైట్ మంగళవారం ఆయన పెద్ద ఫొటో ప్రచురించింది. ఇందులో అతని ఎడమ మణికట్టు మునుపటి కంటే సన్నగా కనిపిస్తున్నది. ఈ ఫొటోలో అతడికి ఇష్టమైన గడియారం అతడి మణికట్టుకు ఉన్నది. దీని ఖరీదు దాదాపు 12 వేల డాలర్లు. నిపుణులు ఈ ఫొటోను 2020 నవంబర్-ఈ ఏడాది మార్చిలో తీసిన ఫొటోతో జత చేసి పరీక్షించారు. 37 ఏండ్ల కిమ్కు ఏకరీతిగా ధూమపానం చేయడం అలవాటు. అతని తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 2011 లో గుండెపోటుతో మరణించారు. జీవనశైలి, బరువు కారణంగా కిమ్ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు.
కిమ్ బరువు 140 కిలోలు అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఉటంకిస్తూ ఎన్కే న్యూస్ పేర్కొన్నది. ఇదే సమయంలో 2011 లో అధికారంలోకి వచ్చిన తర్వాత అతని బరువు దాదాపు 7 కిలోలు పెరిగింది. అయితే, తాజా ఫొటోలో సన్నగా కనిపిస్తున్న కిమ్ ఏదో ఒక వ్యాధి కారణంగా అలా కనిపిస్తున్నాడా? లేదా బరువు తగ్గడం పట్ల నిజంగానే శ్రద్ధ కనబరిచారా? అనేది సందేహాత్మకంగా ఉన్నది.
ఇలాఉండగా, ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కరోనా మహమ్మారి సమయంలో చైనాతో వాణిజ్యం తగ్గడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఇదే సమయంలో అంతర్జాతీయ ఆంక్షలు కూడా వీరి మార్గంలో పెద్ద అడ్డంకిగా మిగిలాయి. బాలిస్టిక్ క్షిపణి, అణు పరీక్షల తర్వాత ఉత్తర కొరియాపై ఈ ఆంక్షలు విధించారు.
గతంలో కూడా చాలాసార్లు కిమ్ ఆరోగ్యం గురించిన ఊహాగానాలు మార్కెట్ను వేడెక్కించాయి. కిమ్ ఆరోగ్యం విషమంగా మారిందని, శస్త్రచికిత్సలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఆయన వారసులు ఎవరు, రానున్న రోజుల్లో అక్కడి పరిపాలన ఎలా ఉండబోతున్నది అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని వారాల పాటు మీడియాకు దూరంగా ఉండటం వల్లనే కిమ్ ఆరోగ్యంపై దుమారం చెలరేగిందని ఉత్తర కొరియా ప్రభుత్వం అనంతరం వెల్లడించింది.
నియామకం : యూఎన్ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్లలో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..