చెన్నై: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గ్యారంటీగా తమిళనాడు సీఎం అవుతారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం సేలంలో అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. స్టాలిన్ సీఎం అన్నది ఎప్పుడో నిర్ణయమైందని, ఎన్నికలు ఆ విషయాన్ని నిర్ధాయిస్తాయని చెప్పారు. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ వద్ద అంతులేని డబ్బు ఉన్నదని, అందుకే పోరాటాన్ని ఆపకూడదని రాహుల్ తెలిపారు. వారిని నిలువరించాలంటే మొదట తమిళనాడులో ఓడించాలని, తర్వాత ఢిల్లీలో అధికారం నుంచి తప్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమిత్ షా లేదా మోహన్ భగవత్ కాలిని తాకాలని ఏ తమిళ వ్యక్తి కోరుకోరని రాహుల్ తెలిపారు. అయితే సీఎం పళనిస్వామి వారి ముందు ఎందుకు మోకరిల్లుతున్నారు అన్న ప్రశ్న తలెత్తుతున్నదని అన్నారు. వాస్తవానికి మోదీ ముందు తలవంచడం ఆయనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఈడీ, సీబీఐని ప్రధాని నియంత్రిస్తున్నారని, సీఎం అవినీతి పరుడుకావడంతో భయంతో మోకరిల్లుతున్నారని రాహుల్ విమర్శించారు.