లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ప్రబుద్ద్ సమ్మేళన్లో బీఎస్పీ చీఫ్ మాయావతి పాల్గొన్నారు. బీజేపీ పాలనలో కన్నా.. బీఎస్పీ పాలన సమయంలో బ్రాహ్మణులకు మంచి జరిగినట్లు బ్రాహ్మణ వర్గం అంగీకరించినట్లు ఆమె తెలిపారు. ఒకవేళ మేం రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, అప్పుడు బ్రాహ్మణ వర్గానికి పూర్తి రక్షణ కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. 2007లో ప్రభుత్వాన్ని స్థాపించిన రీతిలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, దాని కోసం బ్రాహ్మణ సమాజాన్ని ఎక్కువ సంఖ్యలో కలుపుకుని పోవాలని ఆమె అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 9వ తేదీన జరగనున్న కాన్షీరామ్ నివాళి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. యూపీ అభివృద్ధిపైనే తాను ఫోకస్ పెట్టనున్నట్లు ఆమె చెప్పారు. పార్క్లు, స్మారక చిహ్నాల నిర్మాణంపై ఈసారి దృష్టి పెట్టడం లేదని మాయావతి అన్నారు.