న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయని వీటిపై లోతైన సమీక్ష అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
అసోం, కేరళలో పార్టీకి ఘోర వైఫల్యం ఎదురైందని, పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కు కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో పలు స్వరాలు వినిపిస్తున్న వేళ తాజా ఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలించాలని అన్నారు. ఇక ప్రస్తుత కొవిడ్ -19 కలకలం నేపథ్యంలో పార్టీలకు అతీతంగా అందరూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కార్యాచరణకు దిగాలని కపిల్ సిబల్ సూచించారు.