న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఆమెకు పంపిన లేఖలో పేర్కొన్నది. అయితే రుజిరా బెనర్జీ.. ఈడీకి లేఖ రాశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, మహమ్మారి కరోనా సమయంలో ఢిల్లీకి ప్రయాణం చేయలేనని, కోల్కతాలోనే విచారణను ఎదుర్కోనున్నట్లు ఆమె ఈడీకి సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ ఆరో తేదీ లోగా ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడే ఎంపీ అభిషేక్ బెనర్జీ. అయితే కేంద్రం, మమత మధ్య గత కొన్నాళ్ల నుంచి వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్లో అక్రమ బొగ్గు మైనింగ్తో లింకు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపడుతున్నది.