భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవేస్థానం హుండీ ఆదాయం రూ.1.08 కోట్లుగా తేలింది. గురువారం దేవస్థాన ఈవో బానోత్ శివాజీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జనవరి 28 నుంచి ఇప్పటివరకు ఆదాయం లెక్కించగా రూ. 1.08 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 820 గ్రాముల వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు.