న్యూఢిల్లీ, ఆగస్టు 5: మెదడు సంబంధిత వ్యాధుల అధ్యయనం, చికిత్స పద్ధతుల కోసం హర్యానాకు చెందిన జన్యుశాస్త్రవేత్త యోగితా కే అడ్లాకా ‘హ్యూమన్ బేస్డ్ మోడల్’ను అభివృద్ధి చేశారు. దీంతో మెదడు నిర్మాణం, ఆటిజమ్ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణాలు, మెరుగైన చికిత్స పద్ధతులను అన్వేషించవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) బుధవారం వెల్లడించింది. మెదడు సంబంధిత వ్యాధుల అధ్యయనానికి దశాబ్దాలుగా జంతు సంబంధిత మోడల్ను పాటిస్తున్నారు. అయితే నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధుల చికిత్సకు ఈ మోడల్ను ఆధారంగా చేసుకొని ఇస్తున్న ఔషధాలు పనిచేయడంలేదు. దీంతో రక్తకణాల ఆధారంగా యోగితా ఆవిష్కరించిన తాజా ‘హ్యూమన్ బేస్డ్ మోడల్’ ఈ లోటును భర్తీచేస్తుందని భావిస్తున్నారు.