డెహ్రాడూన్: భారతీయ జనతాపార్టీ ఒక సాధారణ కార్యకర్తకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న పుష్కర్సింగ్ ధామి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు. నాకు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు నిండా ఏడాది కూడా సమయం లేదని, ఇంత తక్కువ కాలంలోనే ఇతర నాయకుల సాయంతో ప్రజలకు సేవ చేయడం సవాలు లాంటిదని, ఆ సవాలును తాను స్వీకరిస్తున్నానని ధామి వ్యాఖ్యానించారు.
కాగా, పుస్కర్ సింగ్ ధామి పితోగఢ్లో జన్మించారు. ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మల్యేగా గెలించారు. ఉద్ధమ్సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు ధామి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కోశ్యారీ దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. కాగా, ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరాఖండ్లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో బీజేఎల్పీ సమావేశంలో జరిగింది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి ప్రకాష్సింగ్ ధామిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.