హైదరాబాద్: కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టికి డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 81,944 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 123.08 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 93.125 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 55 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. దీంతో తొమ్మిది గేట్లు ఎత్తి 57,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 33.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 30.47 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువన ఉన్న జూరాలకు ప్రస్తుతం 5500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.