వికారాబాద్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17ఏళ్ల యువతి.. తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వడం లేదంటూ మనస్థాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన వీరు.. దిర్సంపల్లి పౌల్ట్రీ ఫాంలో కూళీలుగా పని చేస్తున్నారు. తండ్రి గులాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.