నాలుగు గుంటల్లో తోటల పెంపకం
నెలకు వేలల్లో ఆదాయం
ఆరు పదుల వయసులోనూ తోట పనితో ఆరోగ్యం
దహెగాం, ఏప్రిల్ 29: దహెగాం మండలంలోని కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన పాగిడి విమలాబాయికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. పిల్లలు స్థిర పడ్డారు. అయినా ఆరు పదుల వయసులో నాలుగు గుంటల్లో మల్లెపూల తోటను పెంచుతూ, పూల వ్యాపారం చేస్తున్నది. ఇప్పటికీ తన ఆరోగ్య రహస్యం పూల తోటలో పనిచేయడమేనంటూ నవ్వుతూ చెబుతున్నది. పూలను గ్రామాల్లోకి వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ విక్రయిస్తూ, ఆర్థికంగా సంపాదించుకుంటున్నది. ఇలా గ్రామాల్లో పూలమ్మగా మహిళలందరితో ఆప్యాయంగా పిలిపించుకుంటున్నది.
నాలుగు గుంటల్లో ‘మల్లె’..
తనకు ఉన్న వ్యవసాయ భూమిలో బావి వద్ద నాలుగు గుంటల్లో మల్లె తోట సాగు చేస్తున్నది. తానే స్వయంగా తోట పనులు చేస్తూ, పూ లను సేకరించి మాలలు(దండలు) తయారు చేసి రోజూ ఉదయం పూట సమీపంలోని దహెగాం, మర్రిపల్లి, లగ్గాం, పంబాపూర్ గ్రామాలకు వెళ్లి, పూలమాలను విక్రయిస్తుంటుంది. ఇలా నిత్యం సుమారు రూ. 500 నుంచి రూ. 1000 వరకు సంపాదిస్తున్నది. నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆదాయం పొందుతున్నది. యేటా మార్చి నుంచి జూన్ నెల వరకు పూలతోట సాగు చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటు న్నది. తోట పని వల్లే తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నది.
సాగులో చేపట్టే చర్యలు
యేటా జనవరిలో మల్లె చెట్ల ఆకులు రెబ్బడంతో పాటు ఎండిన కొమ్మలను తొలగిస్తుంది. అదేవిదంగా సేంద్రియ(మేక) ఎరువును మొక్కలకు వేస్తూ, నాళ్లు పట్టుతుంది. చీడపీడలు పట్టిన ఆకులను గుర్తించి వాటిని తొలగిస్తుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి పూలు చేతికివస్తాయి. రోజూ సాయంత్రం పూలను సేకరించి మాలలు తయారు చేసి ఉదయాన్నే గ్రామాల్లోకి వెళ్లి అమ్ముతుంటుంది.
ఆరేండ్లుగా పూలు అమ్ముతున్నా..
ఆరేండ్ల నుంచి మల్లెపూల తోట సాగు చేస్తున్నా. ఐదు నెలల పాటు రోజుకు ఐదు వందలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నది. ఇంటింటికీ వెళ్లి పూలను అమ్ముతుంటా. అందరూ నన్ను పూలమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటరు. ఆ పిలుపు వింటేనే చాలా సంతోషంగా ఉంటది. కాలినడకనే ఊర్లన్నీ తిరుగుతూ పూలమ్ముతా. తోట పనితో పాటు ఇలా కాలినడకన తిరగడమే నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నది. తోట పనిలో ఇంట్లో వాళ్లు కూడా సహకరిస్తుంటరు. శుభకార్యాల సమయంలో ఆదాయం కొంత ఎక్కువగానే ఉంటుంది. కొందరు తోట వద్దకు వచ్చి పూలు తీసుకెళ్తరు. నెలకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల లోపు ఆదాయం వస్తున్నది. – పాగిడి విమలాబాయి, కమ్మర్పల్లి
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ప్రతి బస్సు బయలుదేరేటప్పుడు, వచ్చిన తర్వాత శానిటైజేషన్ చేయిస్తున్నాం. సిబ్బంది మాస్కులు ధరించి విధులకు రావాలని ఆదేశాలు ఇచ్చాం. మాస్కు ధరించినవారే బస్టాండులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. బస్టాండు, పరిసరాల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నాం. తక్కువ మంది ప్రయాణికులున్నపుడు జిగ్జాగ్ పద్ధతిలో కూర్చుండాలని సూచిస్తున్నాం. – మేకల మల్లేశయ్య, డిపో మేనేజర్, ఆర్టీసీ, మంచిర్యాల