నర్సింహులపేట, మే 27: కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ పంచాయతీ కార్యదర్శి పడరాని పాట్లు పడుతున్నది. దాతలు సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బాసుతండా పంచాయతీ కార్యదర్శి రామగిరి మౌనిక భర్త శ్రీనివాస్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స ప్రారంభంలోనే రెండు ఊపిరితిత్తులు పాడైనట్టు వైద్యులు చెప్పారు. ఇప్పటికి రూ.20 లక్షల వరకు ఖర్చయ్యాయి. ఊపిరితిత్తులు మార్చడం కోసం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు నెల రోజుల క్రితమే మౌనిక తండ్రి నర్సయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పేద కుటుంబంలో ఉన్న మౌనిక తన భర్తను బతికించుకునేందుకు దాతలను వేడుకుంటున్నది. సాయం చేయాలనుకునే వారు ఫోన్ పే/గూగుల్ పే నంబర్ 9121683884, లేదా ఎస్బీఐ ఖాతా నంబర్ 62055254393, ఐఎఫ్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020087కు తోచిన సాయం చేయాలని విజ్ఞప్తిచేస్తున్నది. ప్రభుత్వం కూడా కరుణించి తన భర్తను బతికించాలని వేడుకుంటున్నది.