హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలుచేయడంతోపాటు కొవిడ్ కట్టడికి అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. ఈనెల 30 వరకు లాక్డౌన్ను పొడిగించి న నేపథ్యంలో బుధవారం ఆయన జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతీరును సీఎం కేసీఆర్ ప్రతిరోజూ జిల్లాలవారీగా సమీక్షిస్తున్నారని తెలిపారు. ఈ నెల 30 అనంతరం మళ్లీ లాక్డౌన్ను పొడిగించాల్సిన అవసరం లేకుండా చూడాలని చెప్పా రు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ నిత్యావసరాల కోసంప్రజలు ఉద యం 8 తర్వాతే బయటికి వస్తున్నారని, మార్కెట్లు, దుకాణాల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.ఈ పరిస్థితిని నివారించడానికి ఉద యం 6 నుంచే మార్కెట్లకు వెళ్లేలా ప్రజలనుచైతన్యపర్చాలని డీజీపీ సూచించారు.
ఉదయం 9.45 గంటల నుంచే పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు, డీఎస్పీలు, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి లాక్డౌన్ను పర్యవేక్షించాలని డీజీపీ ఆదేశించారు. లాక్డౌన్ సడలింపు ముగియగానే అన్ని పెట్రోలింగ్ వాహనా లు సైరన్వేసి సంచరించాలని స్పష్టం చేశారు. కూరగాయలు, చేపల మార్కెట్లలో రద్దీని వికేంద్రీకరించేందుకు మార్కెటింగ్, మున్సిపల్అధికారులతో కలిసి చర్యలు చేపట్టాలన్నారు. 10గంటల తర్వాత అనుమతిలేని వాహనాలను సీజ్చేయాలని చె ప్పారు. ప్రధాన రహదారుల్లోనే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా లాక్డౌన్ అమలుచేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్కు సామన్యుల నుంచి సహకారం లభిస్తున్నదని, ఈ విషయంలో పోలీస్శాఖపై ఫిర్యాదులు రావడంలేదని తెలిపారు. శాంతి భద్రతల విభాగం అదన పు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ ప్రభాకర్రావు పాల్గొన్నారు.