న్యూఢిల్లీ : దేశంలోని వీఐపీల భద్రతకు బ్లాక్ క్యాట్ కమాండోస్ను కేటాయించడం మనందరికి తెలిసిందే. వీరంతా జాతీయ భద్రతా దళాలకు చెందిన ప్రతినిధులు. ఎంతో ధైర్యవంతమైన ఈ సైనికుల ఎంపిక చాలా కఠినంగా జరుగుతోంది.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థను 1984లో ఏర్పాటు చేశారు. ఈ దళాలు దేశంలోని ప్రత్యేకమైన వ్యక్తులకు భద్రతను కల్పిస్తాయి. ఈ దళాల ఎంపిక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో జరగదు. ఆర్మీ, పారామిలటరీ బలగాల నుంచి వీరిని ఎంపిక చేస్తారు. ఇండియన్ ఆర్మీ నుంచి 53 శాతం మంది సైనికులను, మిగతా 47 శాతం మంది సైనికులను సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల నుంచి ఎంపిక చేస్తారు.
ఈ ఎంపికైన సైనికులకు 90 రోజుల కఠినమైన శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఓ పరీక్ష నిర్వహించి, అందులో నెగ్గిన వారికి వారం రోజుల పాటు మరింత కఠినమైన శిక్షణను ఇస్తారు. ఈ శిక్షణలో 80 శాతం మంది సైనికులు ఫెయిల్ అవుతారు. కేవలం 20 శాతం మంది మాత్రమే తర్వాతి స్టేజ్కు ఎంపిక అవుతారు. చివరి రౌండ్ వచ్చే సరికి కేవలం 15 శాతం మంది సైనికులు మాత్రమే మిగులుతారు. సైకలాజికల్ టెస్టు కూడా నిర్వహిస్తారు.
ఎన్ఎస్జీ కమాండోస్ జీతాలు ఒక్కో సైనికుడికి నెలకు రూ. 84 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటాయి. ప్రతి నెల సగటున వారి జీతం రూ. 1.5 లక్షలు ఉంటుంది.