ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయీబ్రాహ్మణుల సెలూన్ లకు 250 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేయడంతో ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా, పట్టణ నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్నచిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
నాయీబ్రాహ్మణులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మందపెల్లి శ్రీనివాస్ అధికార ప్రతినిధి వై.రామ్ కుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుకారామ్, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేర్లవార్ రవీందర్ లింగంపల్లి రాములు, వెంకటేష్, రవి, కిషన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..