దుండిగల్ : ట్రాఫిక్ సిగ్నల్స్ కారణాలతోనే ప్రపంచ వ్యాప్తంగా యేటా 20 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా యి. అందులో ఎంతో మంది ప్రాణాలను కోల్పుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రమాదాలను నివారించాలనే సంకల్పంతో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ పరిధిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్ వీజేఐఈటీ) కళాశాలకు చెందిన అధ్యాపకులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. విజ్ఞాన జ్యోతి సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామిక వేత్త డా॥ డీఎన్ రావు, ప్రధానాధ్యాపకుడు డా॥సీడీ నాయు డు, ఆచా ర్య డా॥ఎన్.బాలాజీ, ఈసీఈ విభాగ సహాయాచార్యుడు వి.నవీన్ కలిసి అనేక పరిశోధనలు సాగించి నూతన సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించారు. ‘ఇంటెలిజెంట్ అండ్ ఇనిట్యూటివ్ సిగ్నలింగ్ సిస్టమ్ (ఐఐఎస్ఎస్)’ పేరిట విజయవంతంగా దాని ని ఆవిష్కరించారు. ఆ సాంకేతిక పరిజ్ఞానానికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులను సైతం పొందడం విశేషం. దీనిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎనిమిది రకాల ఇండికేటర్లు..
ఫోర్ వీలర్, టూ వీలర్ కావొచ్చు అందు లో సాధారణంగా మనకు రెండు రకాల సిగ్నల్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఎడ మ, రెండోది కుడి వైపు ఉంటుంది. అంతే తప్ప ఇతర సిగ్నల్స్ ఏవీ ఉండవు. ఇదే అనే క ప్రమాదాలకు కారణమవుతుంది. కొంద రు వాహనదారులు ఎడమ ఇండికేటర్ వేసి కుడివైపు, కుడి ఇండికేటర్ వేసి ఎడమవైపు తిరుగుతుంటారు. అదే విధంగా ముందు వెళ్తున్న వాహనం ఎటు వెళ్తుంది? ఆగుతుం దా? యూ టర్న్ తీసుకుంటుందా? పార్క్ చేస్తున్నారా? అలాగే, ముందుకు వెళ్తారా? తదితర విషయాలేవీ వెనక ఉన్న వాహనదారులకు తెలియవు. ఇలా వాహనదారులు గందగోళం లో ప్రమాదాలకు గురవుతున్నా రు. వాటిని నివారించేందుకు ప్రొఫెసర్లు ఐఐఎస్ఎస్ పేరిట నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
అందుబాటు ధరలోనే..
ఐఐఎస్ఎస్ వాహనదారుడికి శ్రమ లేకుండా చేస్తుంది. తన గమనాన్ని సరైన సూచనల ద్వారా తన వెనకున్న వాహనదారులకు తెలియజేస్తుంది. హఠాత్తుగా బ్రేక్ వేసినా, పార్క్ చేస్తున్నా, యూటర్న్ తీసుకుంటున్నా ఎనిమిది రకాల సూచనలను చేస్తుంది. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను సాధ్యమైనంత వరకు తగ్గించడానికి అవకాశాలున్నాయి. పేటెంట్ హక్కుల రావడం ఆనందంగా ఉంది. త్వరలోనే అందుబాటులో ఉండే ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం.- నవీన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీఈ;