లక్నో: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మొరాదాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది, డీసీఎంలో 20 నుంచి 25 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. ప్రైవేటు బస్సు పంజాబ్ నుంచి ఫిలిబిత్కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. తమ డీసీఎంను పోలీసులు ఆపారాని, వెనుకన నుంచి దూసుకొచ్చిన బస్సు ట్రక్కును గుద్దిందని డీసీఎం ప్రయానికుడు తెలిపారు. తమవారిలో ముగ్గురు మరణించారని, చాలా మంది గాయపడ్డారని వెల్లడించారు.