న్యూఢిల్లీ: కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయులకు యూరోప్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ టీకాకు ఇంకా యురోపియన్ యూనియన్ నుంచి అనుమతి దక్కలేదు. దీనిపై ఇవాళ సీరం సంస్థ ఆదార్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. ఆయన తన ట్విట్టర్లో ఈ అంశంపై స్పందిస్తూ.. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయుల గురించి యురోపియన్ యూనియన్లో ఉన్న నేతలతో చర్చించినట్లు చెప్పారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ టీకాలను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవీషీల్డ్కు ఇంకా ఈయూ అనుమతి దక్కలేదు. దీంతో యురోపియన్ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించనున్నట్లు పూనావాలా తెలిపారు. ఈయూ ఔషధ నియంత్రణాధికారులతో పాటు, దౌత్యపరమైన రీతిలోనూ ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు సీరం సీఈవో తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్లో వాక్స్జెవ్రియా పేరుతో కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాతో పాటు ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే టీకాలకు మాత్రమే ఈయూలో గుర్తింపు ఉంది.