జయశంకర్ భూపాలపల్లి : త్వరితగతిన ధాన్యం ఎగుమతులు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. గణపురం మండలంలోని బస్వరాజ్ పల్లి గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ధాన్యం ఎగుమతి గురించి, లారీ డ్రైవర్స్ , కాంట హమాల లకు ఏర్పాటు చేసిన వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీ డ్రైవర్, క్లీనర్లకు భోజన, మంచినీటి, వసతితో పాటు శానిటేషన్, మాస్క్ లను కూడా ఏర్పాటు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ ను ఆదేశించారు.త్వరితగతిన ధాన్యం ఎగుమతి చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
పోలీసుల సేవలు ప్రశంసనీయం : మంత్రి సత్యవతి రాథోడ్
టీకాల తయారీపై గడ్కరీ ప్రకటన.. కాంగ్రెస్ చురకలు