లక్నో : కరోనా మహమ్మారికి వేలాది మంది బలవుతున్న విషయం విదితమే. ఈ సెకండ్ వేవ్లో ప్రధానంగా కరోనా వైరస్.. శ్వాస వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి చాలా మంది మరణిస్తున్నారు. అయితే ప్రోనింగ్ విధానంతో ఓ 82 ఏండ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్ చేయండని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంట్లోనే స్వల్ప లక్షణాలతోపాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఓ 82 ఏండ్ల వృద్ధురాలికి గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడింది. ఈ క్రమంలోనే ఆమెకు ఆకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో హోం ఐసోలేషన్లో ఉన్న వైద్యులు, తమ కుమారుల సూచన మేరకు ప్రోనింగ్ చేసుకుంది. అలా ఆమెలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగి 12 రోజుల్లోనే కరోనాను జయించింది. ప్రోనింగ్ చేయడంతో పాటు ఆమె గదిలో లవంగాలు, కర్పూరం ఉంచి ఆ గాలిని పీల్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నాలుగు రోజుల్లోనే 79 నుంచి 97కు ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయి ఆమెకు. ఆ వృద్ధురాలు డయాబెటిక్ పేషెంట్ కూడా. బీపీ కూడా అధిక స్థాయిలో ఉంది. అయినప్పటికీ ప్రోనింగ్ టెక్నిక్ ఆమె ప్రాణాలను కాపాడింది.
ఇవి కూడా చదవండి..