న్యూఢిల్లీ, మే 26: భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లో సంస్కరణలను సిఫారసు చేసేందుకు కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ మరో బాధ్యత కూడా చేపట్టనున్నది. భాష, భావ వ్యక్తీకరణకు సంబంధించిన నేరాలకు ప్రత్యేక సెక్షన్ను ప్రతిపాదించనున్నది. ‘ద్వేషపూరిత ప్రసంగం’ అంటే ఏమిటో నిర్వచించనున్నది. ఏది ద్వేషపూరిత ప్రసంగం అవుతుందన్న నిర్వచనం ఐపీసీలో లేదు. మొదటిసారిగా అలాంటి ప్రసంగానికి నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం కమిటీ చేయనున్నది. ఈ కమిటీ తన నివేదికను త్వరలో అందజేయనున్నది. తీవ్రమైన, కఠినమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం విద్వేష ప్రసంగం కింద రాదని ఇటీవల ముంబై హైకోర్టు తీర్పు చెబుతూ… ముంబైకి చెందిన ఓ వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. మరోవైపు మణిపూర్, ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు ‘దేశద్రోహం చట్టాన్ని’ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భావ వ్యక్తీకరణ వంటి ప్రాథమిక హక్కును ఆ చట్టం కాలరాస్తున్నదని వారు పేర్కొన్నారు.