కరోనా నియంత్రణకు హోంశాఖ తాజా మార్గదర్శకాలు...

ఢిల్లీ :కరోనా కట్టడిలో భాగంగా దేశంలోని రాష్ట్రాలు అనుసరించాల్సిన తాజా మార్గదర్శకాలను హోం మంత్రిత్వశాఖ జారీచేసింది. నిఘా, నియంత్రణ, అప్రమత్తత కోసం ఈ మార్గదర్శకాలు 2020 డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉండనున్నాయి. ఇటీవల కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖ నూతన మార్గదర్శకాలను జారీచేసింది.
శీతాకాలం కూడా రావటం, మళ్లీ పండుగల సీజన్ల కారణంగా పూర్తిగా ఈ మహమ్మారి నుంచి బైటపడటానికి జాగ్రత్తలు అవసరమని హోం మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. హోంమంత్రిత్వశాఖ, వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ, స్థానిక అధికారులు, పోలీసులు జారీ చెసిన నియంత్రణ వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేయటం, నిఘా పెంచటం, మార్గదర్శకాలను, ప్రామాణిక నిర్వహణా నియమాలను పాటించటం ద్వారా ఎదుర్కోవాలని కోరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా కోవిడ్ నియంత్రణకు మరికొన్నిఆంక్షలు విధించవచ్చని కేంద్రం తెలిపింది.
నిఘా, నియంత్రణ తప్పనిసరి...
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్కడి జిల్లా ఆధికారులు కంటెయిన్మెంట్ జోన్ల పరిధులు కచ్చితంగా గుర్తించేట్టు చూడాలి. ఈ విషయంలో ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాలి. ఆయా రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్లు కంటెయిన్మెంట్ జోన్ల వివరాలను వెబ్ సైట్ లో ప్రదర్శించాలి. ఆ జాబితాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కూడా పంపాలి. కంటెయిన్మెంట్ జోన్లలో కేవలం అత్యవసర కార్యకలాపాలు మాత్రమే అనుమతించాలి. కంటెయిన్మెంట్ జోన్ల పరిధిలో ఆంక్షలు కచ్చితంగా అమలు చేయాలి. ఈ జోన్ల నుంచి ప్రజలు బైటికు వెళ్ళటం లేదా లోపలికి రావటాన్ని పూర్తిగా నియంత్రించాలి. నిత్యావసరాలు, వైద్య అవసరాలకు మాత్రమే అనుమతించాలి. నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్ళి పరిశీలించాలి.
అవసరాన్ని బట్టి నిర్థారణ పరీక్షలు...
పాజిటివ్ గా తేలిన వ్యక్తులు ఎవరెవరికి దగ్గరగా వెళ్లారో ఆ జాబితా కచ్చితంగా తయారు చేయాలి. అదే సమయంలో ఆచూకీ కనిపెట్టటం, గుర్తించినవారిని క్వారంటైన్ లో ఉంచటం, 14 రోజులపాటు వరుసగా వారిని పర్యవేక్షించటం తప్పనిసరి. సోకే అవకాశమున్నవారిలో కనీసం 80 శాతం మందిని 72 గంటలలోగా ఆచూకీ పట్టుకోవాలి. అటువంటి వారిని వెంటనే ఐసొలేషన్ కు తరలించటం, లేదా ఆస్పత్రికి తరలించాలి. ఇండ్లలో కచ్చితంగా ఐసోలేషన్ మార్గదర్శకాలు పాటించాలి. అవసరమైన మేరకు చికిత్సాపద్ధతులు కచ్చితంగా పాటించేట్టు చూడాలి. శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారికి ఆరోగ్య కేంద్రాలలో లేదా మొబైల్ సేవల ద్వారా లేదా బఫర్ జోన్లలో ఉన్న జ్వర చికిత్సాకేంద్రాల ద్వారా చికిత్స అందేట్టు చూడాలి.
మాస్క్ ధరించని వ్యక్తులకు జరిమానా...
కోవిడ్ నియంత్రణకు అవసరమైన ప్రవర్తన గురించి స్థానిక ప్రజలలో తగినంత అవగాహన కలిగించాలి. కంటెయిన్మెంట్ చర్యలను కఠినంగా అమలు చేయటంలో స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆ అధికారులను బాధ్యులను చేయాలి. కోవిడ్ నియంత్రణకు అవసరమైన మార్గదర్శకాలు అమలు చేయటానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. అందులో భాగంగా మాస్కులు ధరించటాన్ని, చేతుల పరిశుభ్రతను కచ్చితంగా అమలు చేయాలి. అవసరమనిపించినప్పుడు పాలనాపరమైన చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వ్యక్తులకు జరిమానా విధించవచ్చు..
రద్దీ ప్రదేశాలలో...
రద్దీ ప్రదేశాలలో ముఖ్యంగా మార్కెట్లు, వారాంతపు సంతలలో, ప్రజారవాణా కేంద్రాలలో భౌతిక దూరం పాటించటానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడిగా ప్రామాణిక ఆచరణావిధానాలను జారీ చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి. కోవిడ్-19 నిర్వహణకు సంబంధించిన జాతీయ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా యధావిధిగా కొనసాగుతాయి. అప్పుడే కోవిడ్ నియంత్రణకు తగిన ప్రవర్తన అమలు సాధ్యమవుతుంది.
కంటెయిన్మెంట్ జోన్లకు...
కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. అయితే, దిగువ పేర్కొన్న అంశాలకు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతి ఉంటుంది.
-హోం మంత్రిత్వశాఖ అనుమతి మేరకు అంతర్జాతీయ ప్రయాణానికి ఆమోదం
-50శాతం సీట్లతో సినిమా థియేటర్లకు అనుమతి...
-ఈత కొలనులు కేవలం క్రీడాకారులకు మాత్రమే అనుమతి
-వ్యాపారులకోసం మాత్రమే ఎగ్జిబిషన్ హాల్స్ (బి2బి)
-గరిష్ఠ పరిమితి 200 కు లోబడి హాల్ సామర్థ్యంలో 50శాతం మాత్రమే అనుమతిస్తూ సామాజిక, మతపరమైన, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి: బహిరంగ ప్రదేశాలైతే ఆ ప్రాంగణం వైశాల్యాన్ని బట్టి అనుమతి. -పరిస్థితిని అంచనావేసిన మీదట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంతం హాళ్లలో గరిష్ఠ పరిమితిని 100 మందికి, లేదా అంతకంటే తక్కువకు కుదించవచ్చు.
-అందరి సమాచారం నిమిత్తం ఈ మార్గదర్శకాలకు గతంలో సందర్భానుసారం జారీచేసిన ప్రామాణిక ఆచరణ విధానాలను, అనుమతించిన కార్యకలాపాలను సంబంధిత అధికారులు వీటిని కచ్చితంగా అమలు చేయాలి.
-స్థానిక ఆంక్షలు...
స్థానిక పరిస్థితిని అంచనా వేసిన మీదట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రిపూట కర్ఫ్యూ లాంటి కొన్ని ఆంక్షలు విధించవచ్చు. అయితే, కేంద్రం నుంచి ముందస్తు అనుమతి లేకుండా కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల స్థానికంగా లాక్ డౌన్ మాత్రం విధించకూడదు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమపరిధిలోని కార్యాలయాలలో భౌతిక దూరం పాటించే నిబంధనలు అమలు చేయాలి. వారం వారం పాజిటివ్ ల శాతం 10 శాతాన్ని మించి ఉంటున్నట్టు తేలిన నగరాలలో కార్యాలయాల సమయాలను విడి విడిగా మార్చి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
-అంతరాష్ట్రాల మధ్య ఆంక్షలు లేవు...
-రాష్ట్రం లోపలగాని, రాష్ట్రాల మధ్య గాని వ్యక్తుల రాకపోకలకు, సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలూ ఉండవు. విదేశీ సరకు రవాణాకు కూడా ఈ సడలింపు అమలులో ఉంటుంది. ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు గాని, ఈ-పాస్ లు గాని అవసరం లేదు.
వ్యాధిబారిన పడే అవకాశమున్నవారు అప్రమత్తంగా ఉండాలి..
వ్యాధి బారిన పడే అవకాశమున్నవారు- అంటే 65 ఏండ్ల వయసు పైబడినవారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏండ్ల లోపు పిల్లలు ఇండ్లలోనే ఉండాలి. మరీ ముఖ్యమైన పనులు, ఆరోగ్య అవసరాలకు మాత్రమే బయటకు వెళ్ళాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బైడెన్ వలస విధానానికి గూగుల్, ఆపిల్ సీఈఓల ప్రశంసలు
- రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్ లా కాలేజీ
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు
- నిజామాబాద్లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
- రూ. పది కోట్లకు హ్యాకర్ల స్కెచ్
- ఆ మ్యాచ్ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!
- రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి