శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్టవర్ జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో పటిమహల్లా పల్మార్ ఓ టెర్రరిస్టు పట్టుబడ్డాడు. అతడు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముజామిల్ షాగా గుర్తించారు. అతడు కొద్దిరోజుల క్రితమే ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడని పోలీసులు చెప్పారు. ఇతని వద్ద ఒక గ్రెనెడ్, 30 రౌండ్ల తూటాలు, ఏకే 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.