న్యూయార్క్ : కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న భారత్కు సహాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చింది. యూఎన్కు చెందిన సమీకృత సప్లయ్ చైన్ ద్వారా సహాయం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆటోనియో గుటెర్రస్ తెలిపారు. భారత్లోని పరిస్థతులపై ఐక్యరాజ్య సమితి అధికారులు, భారత్లో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఐక్యరాజ్య సమితి చీఫ్ డెప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. అలాగే యూఎన్లోని భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ద్వారా వివరాలు తెలుసుకోవడంతో పాటు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
భారత్లో పని చేసే యూఎన్కు చెందిన అంతర్జాతీయ సిబ్బంది, లేదంటే భారతీయ సిబ్బంది కరోనా బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు యూఎన్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని, భారత్ కోరుకుంటే అందించేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మహమ్మారి కట్టడిలో సహకరించేందుకు యూఎన్ నుంచి సిబ్బందిని పంపేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఇప్పటికే భారత్లో ఉన్న యూఎన్ సిబ్బంది ఆ మేరకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.