సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లా పచ్ఛాడ్ ఏరియాలోని బాగ్ పాషోగ్ గ్రామం సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన గోతిలో పడింది. ఈ ప్రమాదంలో గోతిలో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలియడంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరకున్నారు. పోలీసులు గోతి నుంచి కారును వెలికితీసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించే పనిలో ఉన్నారు.