సిమ్లా: భారీగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిర్మౌర్ జిల్లాలోని బద్వాస్ సమీపంలోని నాహాన్ వద్ద శుక్రవారం ఒక కొండ బీటలు వారింది. దీంతో కొండచరియలు విరిగిపడటంతో కొండ మీదకు వెళ్లే రోడ్డు లోయలోకి జారిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో జాతీయ రహదారి 707ను మూసివేశారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ భయానక వీడియోను చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. ‘రివేంజ్ ట్రావెలింగ్పై ప్రకృతి రివేంజ్’ అని కొందరు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు పేర్కొన్నారు.