కోల్కతా : పశ్చిమ బెంగాల్లో మత్స్య ప్రియులు ఇష్టంగా ఆరగించే హిల్సా చేప ఈ ఏడాది బెంగాలీల కిచెన్లకు చేరనుంది. ఈ చేపను పెద్ద సంఖ్యలో భారత్కు ఎగుమతి చేస్తామని పొరుగు దేశం బంగ్లాదేశ్ ప్రకటించింది. దేశీ జలాల్లో హిల్సా చేపలు అడుగంటడంతో బెంగాలీలు ఈ చేప కోసం బంగ్లాదేశ్ వైపు చూస్తున్నారు.
అడ్డదారుల్లో బెంగాల్కు స్మగుల్ అవుతున్న హిల్సా చేపను అధిక మొత్తం చెల్లించి రుచి చూస్తున్న బెంగాలీలకు బంగ్లా నిర్ణయం ఊరట ఇస్తోంది. దసరాతో ఆరంభమయ్యే పండగ సీజన్కు ముందు భారత్కు 30 శాతం అధికంగా హిల్సా చేప ఎగుమతులు చేపడతామని బంగ్లాదేశ్ వెల్లడించింది. పద్మా నది నుంచి హిల్సా చేపలను పొరుగుదేశం 2000 టన్నుల వరకూ ఎగుమతి చేస్తుందని ఇది గత ఏడాదితో పోలిస్తే 600 టన్నులు అధికమని అధికారులు తెలిపారు.
20 టన్నుల హిల్సా చేపలతో కూడిన తొలి షిప్మెంట్ గురువారం లేదా శుక్రవారం నుంచి మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని బెంగాల్ చేపల దిగుమతిదారుల సంఘం కార్యవర్గసభ్యడు ఒకరు వెల్లడించారు. హిల్సా చేప ఖరీదు రూ 1500 పైబడి పలుకుతుందని చెప్పారు.