గుండాల, ఏప్రిల్ 5: ప్రతి గ్రామానికి వైకుంఠధామాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి వైకుంఠధామాలను నిర్మిస్తుండగా మండలంలోని గంగాపురం గ్రామంలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. మూడేండ్ల క్రితం గత సర్పంచ్ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన వైకుంఠధామం భవన పైకప్పు గాలిదుమారానికి పూర్తిగా ఎగిరిపోయింది. అయినప్పటికీ దాని మరమ్మతుల గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాలకు గోడలు తడిసి, తలుపులు దెబ్బతిని శిథిలావస్థ్ధకు చేరింది.
గంగాపురంలో రెండుసార్లు పల్లెప్రగతి పనులు చేపట్టినప్పటికీ వైకుంఠధామం భవన పునరుద్ధరణ పనులను మాత్రం చేపట్టలేదు. దాని పైకప్పు ఎగిరిపోవడమే కాకుండా శవ దాహ న వాటిక నిర్మాణంతోపాటు, వైకుంఠధామం ప్రధాన ముఖద్వారం పనులు కూడా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.వైకుంఠధామంలో నీటి వసతి కూడా కరువైంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి వైకుంఠధామం భవ న పైకప్పును సరిచేసి, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయించి వైకుంఠధామాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారులకు పలుమార్లు విన్నవించా
ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గంగాపురంలోని వైకుంఠధామం భవన పైకప్పు గాలిదుమారానికి ఎగిరిపోయింది. దానికి మరమ్మతులు చేయించాలని పలుమార్లు జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితంలేదు. సదరు కాంట్రాక్టర్లకు మిగిలిన పనులను పూర్తి చేయాలని చెప్ప గా ఇప్పటికే కొంత మేరకు పనులు చేపట్టారు. మిగిలిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. వైకుంఠధామం భవన పైకప్పు నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి.
-దార సైదులు, సర్పంచ్ గంగాపురం
పనులు పూర్తి చేస్తున్నాం
గాలిదుమారానికి ఎగిరిపోయిన వైకుంఠధామం భవన పైకప్పు రేకులను సరిచేయడానికి తిరిగి బిల్లులు చేయలేము. మిగిలిన దహ న వాటిక, వైకుంఠధామం ముఖద్వార తోరణం తదితర పనులను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేస్తున్నాం.
ఇవీ కూడా చదవండి…
మావోయిస్టుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
గ్రేటర్లో పక్కాగా ఓటర్ల సర్వే
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్