లక్నో : జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. జనాభా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా.. యూపీ లా కమిషన్ రూపొందించిన యూపీ జనాభా నియంత్రణ విధానం 2021-2030 విధి-విధానాలను యోగి విడుదల చేశారు. జనాభా నియంత్రణకు వివిధ దేశాలు, రాష్ర్టాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఇదిలాఉండగా దేశ ఆర్థికాభివృద్ధికి జనాభా నియంత్రణ అత్యవసరమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. జనాభా నియంత్రణకు యూపీ తీసుకొస్తున్న కొత్త బిల్లును దేశవ్యాప్తంగా అమలుచేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.