న్యూఢిల్లీ, జూలై 20: ఢిల్లీలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ చర్య చేపట్టాయి. ఇప్పటి నుంచి ఆగస్టు 15 వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు సూచించాయి. ఆగస్టు 5న ఢిల్లీలో భీకర దాడి జరిపేందుకు పాక్ ఉగ్రమూకలు కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో అదే తేదీన ఢిల్లీలో దాడి జరిపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భద్రతా బలగాలు హెచ్చరించాయి. దీంతో ‘డ్రోన్ జిహాద్’ ముప్పును తిప్పికొట్టేందుకు ఢిల్లీ పోలీసులతోపాటు ఇతర భద్రతా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.