వేసవి వచ్చిందంటే చాలు నగరవాసులు చల్లటి ప్రదేశాల్లో వాలిపోతారు. శీతల పానీయాలు, కూల్డ్రింక్స్తో సేద తీరుతుంటారు. నగరంలో ఎక్కడ చూసినా జ్యూస్బండ్లు, షర్బత్, చెరుకు, నిమ్మరసం బండ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొవిడ్ పంజా విసురుతుండడంతో నగరవాసులు చల్లటి పానీయాలకు దూరంగా ఉంటున్నారు. వైరస్ను ఎదుర్కోవాలంటే గోరు వెచ్చటి నీరు కీలకపాత్ర పోషిస్తుండటంతో రోజుకు మూడు నాలుగుసాైర్లెన హాట్వాటర్, టీ,కాఫీ లాంటివి తీసుకుంటున్నారు.
ఎండాకాలం వచ్చిందంటే నగరంలో విచ్చలవిడిగా జ్యూస్బండ్లు, శీతల పానీయాల దుకాణాలు వెలిసేవి. మార్చి, ఏప్రిల్, మే మాసాలు వారికి మెండుగా ఉపాధి దొరికేది. కానీ గత ఏడాది నుంచి వారికి వేసవి కలిసి రావడం లేదు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నగరవాసులు బయట శీతల పానీయాలు తాగడానికి భయపడుతున్నారు. కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్ల జోలికి పోవడం లేదు. వాటితో జలుబు లాంటి ఇబ్బంది తలెత్తితే ప్రమాదమని భావిస్తున్నారు. బయట శుభ్రతపరంగా జాగ్రత్తలు తీసుకుంటారో లేదోననే మీమాంసతో ప్రజలు బయట ఆహారానికి దూరంగా ఉంటున్నారు. భానుడు భగభగమంటున్నా చాయ్లకే జై కొడుతున్నారు. వీలైనంత వరకు గోరు వెచ్చటి నీటిని తాగేందుకు మక్కువ చూపిస్తున్నారు.