కేపీహెచ్బీ కాలనీ, జూన్ 1: లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సీపీ సజ్జనార్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సురేందర్రావు, సీఐలు లక్ష్మీనారాయణ, బోస్కిరణ్ పాల్గొన్నారు.