గజ్వేల్, జూలై 4: గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మించిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ చిరువ్యాపారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయం, ఎడ్యుకేషన్ హబ్లను ఆయన సందర్శించి నిర్మాణం, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు చాలా బాగున్నాయన్నారు. సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ చాలా బాగుందని, కూరగాయలు విక్రయించుకోవడానికి చిరువ్యాపారులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారన్నారు. మార్కెట్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసి చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్కు సూచించారు. అనంతరం గజ్వేల్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి శాలువా కప్పి సన్మానించి స్వాగతించారు. ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న వసతులు, విద్యాబోధన తదితర విషయాల గురించి ఎంఈవో సునీత, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతినెలా పంచాయతీలకు రూ.250 కోట్ల నిధులు
ప్రస్తుతం చాలా దేశాల్లో మొక్కల పెంపకం లేకపోవడంతోనే కాలుష్య సమస్యల వస్తున్నదని, అం దుకు ముందుగానే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమా ర్ సుల్తానియా అన్నారు. మండలంలోని అక్కారం లో పర్యటించి గ్రామంలో పూర్తయిన వైకుంఠధామం, డం పింగ్యార్డు, పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి మొక్కల పెంపకం, చెత్త సేకరణ, భగీరథ నీటి సరఫరాపై సర్పంచ్ బాలచంద్రం ద్వారా అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల పంచాయితీలుండగా, ప్రతినెలా రూ.250 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామంలో తప్పనిసరిగా కార్యదర్శలు ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ నియామకం చేపట్టారన్నారు. మారుమూల ఆసిఫాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో కూడా నేడు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కార్యదర్శులు పాలుపంచుకునే విధంగా చేశామన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్క లు నాటి సంరక్షించాలన్నారు. ఆయన వెంట సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రపూల్, డీపీవో పార్థసారధి, డీఆర్డీఏ పీడీ గోపాల్రావు, డీఈవో రవికాంతారావు, ఆర్డీవో విజయేందర్రెడ్డి, డీఎల్పీవో వేదవతి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, ఎంపీడీవో దామోదర్రెడ్డి, ఏవో నాగరాజు, ఎంపీటీసీ ఆంజనేయులు ఉన్నారు.