బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘అఖండ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మంగళవారం టైటిల్తో పాటు టీజర్ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ టీజర్లో నుదిటిపై విభూది తిలకం, మెడలో రుద్రాక్ష మాలలతో చేతిలో త్రిశూలం ధరించి బాలకృష్ణ వినూత్నంగా కనిపిస్తున్నారు. ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ ఆయన చెబుతున్న డైలాగ్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. మే 28న సినిమాను విడుదలకానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:సి.రాంప్రసాద్, సంగీతం: ఎస్.ఎస్. తమన్.