డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున డెహ్రాడూన్ జిల్లా ఛక్రతా పరిధి బ్రినాద్ ప్రాంతంలో కురిసిన వర్షా నికి వరదలు సంభవించి నలుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర విపత్తు స్పందనా దళం ఇప్పటికే రంగంలోకి దిగింది.
రానున్న 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరకాశీ, చమోలీ, భాగేశ్వర్, అల్మోరా, నైనిటాల్, ఛంపావత్, ఉధమ్ సింగ్ నగర్, రుద్రప్రయాగ్, ఫితోర్ ఘర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న కూడా రాష్ట్రంలోని చాలాచోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షం పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.