తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం నాటికి ఏడు జిల్లాలకు యెల్లో అలర్ట్స్ను జారీ చేశారు. తిరువనంతపురం, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు పతనమిట్ట జిల్లాను కూడా ఐఎండీ యెల్లో అలర్ట్లో ఉంచింది. ఏప్రిల్ 18, ఆదివారం వరకు కేరళలో విస్తృత వర్షపాతం నమోదవుతుందని జాతీయ వాతావరణ సంస్థ ఈవారం ప్రారంభంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే.