కమాన్చౌరస్తా/హౌసింగ్బోర్డుకాలనీ ఏప్రిల్ 11: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో పదో తరగతి చ దువుకున్న విద్యార్థులు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. హోదాలను పక్కన బెట్టి ఆప్యాయంగా పలుకరించుకున్నారు. పరస్పరం జీవిత విశేషాలను పంచుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆటాపాటలతో సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను స న్మానించారు. సామూహికంగా విందారగించారు. సాయంత్రం వేళ బై..బై…అంటూ వీడ్కోలు చెప్పుకుంటూ భారమైన హృదయాలతో ఇండ్లళ్లకు తిరిగి వెళ్లారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దేవునూరి సతీశ్, రొడ్డ మధు, మురళీమోహన్, శ్రవణ్రెడ్డి, సురేశ్, సుమన్, పెద్ది సతీశ్, సంజీవ్, సం తోష్, మాధురి, లక్ష్మి, జయశ్రీ, సుమలత, ప్రేమలీల, వీణ పాల్గొన్నారు. అలాగే భగత్నగర్లోని వివేకానంద విద్యానికేతన్లో 2000-21లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పాఠశాల ఆవరణలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగింది. వారందరూ ఒక్కచోట చేరారు. ఆటపాటలతో సందడి చేశారు. పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. వి ద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్ యాదవ్, తిరుపతిరెడ్డి, నరేందర్, భూపతి, హర్జిత్కౌర్, తా హెర్, శంకర్ను సన్మానించారు.
ఇవి కూడా చదవండి
త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు : మంత్రి కేటీఆర్