జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి
వనపర్తి రూరల్, మార్చి 30 : రాష్ట్ర ప్రభుత్వం రైతును బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రం లో ప్రవేశపెట్టిందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దత్తాయిపల్లి, రాజానగరం గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ఆయా చైర్మన్లు విజయ్కుమార్, మధుసూదన్రెడ్డి నిర్వహించిన మహాజన స భ లకు జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకా ర సంఘాలను బలోపేతం చేసేందుకు సొసైటీ డైరెక్టర్లు, రై తులు కృషి చేయాలని పేర్కొన్నారు. రుణాలు తీసుకున్నవారు సకాలంలో చెల్లిస్తే వారికి వడ్డీ మాఫీ ఉంటుందన్నా రు. రైతులు సాగులో నూతన పద్ధతులను అనుసరించాల ని సూచించారు. అదేవిధంగా తప్పనిసరిగా పంట మార్పి డి చేస్తేనే రైతులకు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా ఎదుగుతారన్నారు. అంతకుముందు రాజానగరం, నాగవరం సహకార సంఘాల వార్షిక నివేదికలను సీఈవోలు చదివినిపించారు. అనంతరం రైతులకు పంట రుణ చెక్కు లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, పెబ్బే ర్ వ్యవసాయసహకార చైర్మన్ కోదండరాంరెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, వైస్ చైర్మ న్లు శివకుమార్, రఘువర్ధన్రెడ్డి, కౌన్సిలర్ అలివేలు, నా యకులు సుదర్శన్రెడ్డి, బాలచంద్రయ్య, సత్యనారాయణరెడ్డి, సంజీవ్సాగర్, రాములు, శివకుమార్రెడ్డి, కుర్మ య్య, శాంతమ్మ, వెంకటస్వామి, దేవేందర్నాయుడు, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్రెడ్డి, డైరెక్టర్లు ఉన్నారు.