ఇంద్రవెల్లి, ఏప్రిల్ 22: కరోనా కట్టడి చేసేందుకు గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ఐ మెస్రం లక్ష్మణ్ అన్నారు. ఏమాయికుంట, కెస్లాపూర్, ముత్నూర్, హర్కాపూర్తండా, మెండపల్లి, గిన్నేరా, సమక, శంకర్గూడ గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ల అధ్యక్షతన గురువారం గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకొని అధికారులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కుడే కైలాస్, రాథోడ్ సేవంతబాయి, మెస్రం రేణుకానాగ్నాథ్, లఖన్సింగ్, లక్ష్మణ్, వీఆర్వోలు పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి
నార్నూర్, ఏప్రిల్ 22: కరోనా నియంత్రణకు గ్రామాల్లో అవగాహన కల్పించాలని తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్ పంచాయతీ, రెవెన్యూ సిబ్బందికి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా డప్పు చాటింపుతో ప్రచారం చేయాలన్నారు. పాటించాల్సిన నిబంధనలు వివరించడంతో పాటు ఉల్లంఘించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో రమేశ్, డాక్టర్ విజయ్కుమార్, ఎంపీవో స్వప్నశీల, నాయబ్ తహసీల్దార్ జాదవ్ అమృత్లాల్, సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఇచ్చోడ, ఏప్రిల్ 22: కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే వారికి జరిమానా విధిస్తున్నామని తహసీల్దార్ అతిఖొద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఐకేపీ, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బందికి కొవిడ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, డీటీ రామారావ్, ఎస్ఐ ఫరీద్, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చైనా సైకిళ్ల షేర్డ్ స్కీం ఫెయిల్.. గ్రేవ్యార్డ్ను తలపిస్తున్న బైక్స్
తాజ్ హోటల్ సెట్ కోసం ఎందరు పనిచేశారో తెలుసా..?