అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 53 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 18,20,134కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 75,134గా ఉంది.
జిల్లాల వారీగా తాజా కొవిడ్ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరులో అత్యధికంగా 12 మంది చనిపోగా తూర్పుగోదావరిలో ఆరుగురు, వైఎస్ఆర్ కడప, కృష్ణ, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో నలుగురు చొప్పున, అనంతపూర్, గుంటూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, కర్నూల్, నెల్లూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు.