బెంగళూరు: మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నెల 2న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయన నిబంధనలకు విరుద్ధంగా తన స్వగృహంలో టీకా వేయించుకున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో పెద్దఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం మంత్రి ఇంటికి సిబ్బందిని తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించిన హిరెకెరూర్ తాలూకా హెల్త్ అధికారి ఆర్ మకందర్ను సస్పెండ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం కరోనా వ్యాక్సిన్ను తప్పనిసరిగా దవాఖానలోనే ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ అనంతరం టీకా తీసుకున్నవారు అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. అయితే మంత్రి బీసీ పాటిల్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంట్లోనే టీకా తీసుకున్నారు. టీకా వేసిన అధికారిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం మంత్రిని మాత్రం వదిలేయడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..