న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా భారత్ లో 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 13.31 శాతానికి దిగివచ్చిందని పేర్కొంది.
రికవరీ కేసులు వరుసగా ఆరో రోజు రోజువారీ నూతన కేసుల కంటే అధికంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.23 శాతానికి పెరగడం ఊరట ఇస్తోందని వెల్లడించింది. దేశమంతటా ఇప్పటివరకూ 32 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివిటీ రేటు 7.96 శాతంగా నమోదైందని తెలిపింది.