హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఇంట్లో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మజ్లిస్ నేత పర్వేజ్ తన స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. చాంద్రాయణగుట్టలో ఓ ఇంట్లోకి ఇతర రాష్ర్టాల మహిళలను పిలిపించి ఆశ్లీల నృత్యాలు చేయించారు. మద్యం సేవించిన వారు మగువలతో చిందులు వేసిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..